Posts

Showing posts from September, 2018

కులోన్మాద హత్యను నిరసిస్తూ కార్యక్రమాలను చేపట్టండి.

మిత్రులారా ! మిర్యాలగూడ కులోన్మాద హత్యను నిరసిస్తూ మీమీ జిల్లాల్లో మీకు వీలయినన్ని ఎక్కువ కార్యక్రమాలను చేపట్టండి.   మైనారిటీలుగా మనం Vulnerable సమూహాలం. సమాజంలో ఏ   Vulnerable సమూహానికి ఇబ్బంది వచ్చినా మనం తప్పకుండా స్పందించాలి. మన సంఘీభావాన్ని సంపూర్ణంగా వ్యక్తం చేయాలి. ఆ సమూహంతో మనకు కొన్ని అంశాలలో విబేధాలు వుండవచ్చు. అయినప్పటికీ కష్ట కాలంలో మనం ఆ విబేధాలను పక్కన పెట్టి సానుకూలంగా స్పందించాలి. మన మౌలిక లక్ష్యానికి ఇబ్బంది అయినపుడు మాత్రమే తటస్తంగా వుండాలి. ఎన్నడూ   ఇతర Vulnerable సమూహాలకు వ్యతిరేకంగా వ్యవహరించకుడదు.  

Intellectuals – Social Workers and Political parties

హైదరాబాద్ 15  Sept 2016 మిత్రులారా! Subject : Intellectuals – Social Workers and Political parties . ముస్లిం సమాజంలో ధార్మిక అంశాలను పట్టించుకోవడానికి జమాతులు, ఇమాంలు, మౌల్వీలు అనేకులు వున్నారు. రాజకీయార్ధిక సామాజిక వ్యవహారాల్లో మన సమాజపు స్పందన దాదాపు లేదన్నంత తక్కువగా వుంది.    ముస్లిం ఆలోచనా పరుల వేదిక (MTF)ను   ఆరంభించినపుడు వ్యవస్థాపకుల దృష్టిలో ఒక తక్షణ పరిమిత లక్ష్యం మాత్రమే వుంది మనది కవులు, రచయితలు   కళాకారులు, వృత్తినిపుణుల   వేదిక. కవితలు, కథలు, నవలలు, నాటకాలు, వ్యాసాలు, ఉపన్యాసాల ద్వార రాజకీయార్ధిక సామాజిక వ్యవహారాల మీద స్వీయ ముస్లిం సమాజంలో అవగాహనను పెంచాలనేది మన తొలి లక్ష్యం. మనది పటిష్టమైన నిర్మాణం వుండే సంస్థ కూడా కాదు.   ఒక   విశాల వేదిక మాత్రమే. తొలి లక్ష్యాలను మనం   విజయవంతంగానే సాగించాము. మంచి ఫలితాలు కూడా వచ్చాయి. అయితే ఈలోపు రాజకీయరంగం మనం ఊహించిన దానికన్నా చాలా   వేగంగా వేడెక్కింది.   మన రెండవ లక్ష్యంగా ఒక ప్రజా సంఘం నిర్మాణం, మన మూడవ లక్ష్యంగా రాజకీయ కార్యాచరణ మన కార్యక్రమంలో బలవంతంగా వచ్చి చేరాయి. నిజానికి ప్రజా సంఘాన్ని, రాజకీయ పార్టీన

Political planks of Jagana and Babu

Political planks iof Jagana and Babu జగన్, బాబు ఎన్నికల నినాదాలు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే వాళ్ళను సమర్ధిస్తాము  అని జగన్ అంటున్న మాట ఒక పెద్ద బూటకం. బిజెపీ ఇచ్చేదయితే ఈ పాటికే ఇచ్చి వుండేది. ఒక వేళ  ఇస్తానని 2019లో మళ్ళీ అన్నప్పటికీ మళ్ళీ ఇవ్వదు. తాము అధికారంలోనికి వస్తే ప్రత్యేక హోదా ఇచ్చితీరుతామని ఈపాటికే కాంగ్రెస్ చెప్పింది. తొలుత ఆ వాగ్దానం చేసిందే కాగ్రెస్ ప్రధాని మన్మోహన్ సింగ్. ఎన్నికల్లో  కాంగ్రెస్ ను సమర్ధించకుండా వుండడానికే జగన్  ఈ మాటను వాడుతున్నారు. లేదా ఆయన ఇప్పటికీ బీజేపిని గట్టిగా నమ్ముతూ వుండవచ్చు. నమ్ముతూ వుండవచ్చు. అంతకన్నా కీలకమైన విషయం ఏమంటే, ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రంలోని SC, ST, BC, Minorities లకు కలిగే ప్రయోజనం ఏమిటనీ?  జగణ్‍ హోదా అంశాన్ని అడ్దంపెట్టుకుని అణగారిన సమూహాలను మోసం చేయదలిచారనిపిస్తోంది. చంద్రబాబు హొప్పగా చెప్పుకుంటున్న అమరావతి, పోలవరం ప్రాజెక్టులవల్ల కూడా  SC, ST, BC, Minorities కు కలిగే ప్రయోజనం ఏమిటనేది?  ముఖ్యం. నిర్ధిష్ట సామాజికవర్గాలకు  నిర్ధిష్ట ప్రయాజనం కలిగించే పథకాలు రావాలి

సభల నిర్వహణ - కొన్ని సూచనలు

సభల నిర్వహణ   - కొన్ని సూచనలు స్పీకర్లు ఎవరో తేల్చడానికి ముందు మనం ప్రోగ్రాం థీమ్ ను నిర్ణయించాలి.   ప్రస్తుతం మనం 3 థీమ్ లతో పనిచేస్తున్నాం. 1.       ఆంధ్రా ముస్లింలు – రాజకీయ దశదిశ – 2019 ఇందులోనూ మరలా రెండు రకాలున్నాయి. అ. ముస్లింల రాజకీయ మేధోమధన సదస్సు ( ఒంగోలు, విజయవాడ) ఆ. ప్రజాసంఘాల మేధోమధన సదస్సు (విశాఖపట్నం) 2.       అణగారిన సమూహాల ఆత్మ గౌరవ సదస్సు (హిందూపురం) 3.       ప్రత్యేక అంశం మీద పెట్టే సభలు. రాజ్యాంగాన్ని పరిరక్షించడం – రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తుంది (రాజమండ్రి) అవసరం సందర్భాలను బట్టి ఏ అంశం మీద అయినా సభలు పెట్తవచ్చు. సభ థీమ్, స్వభావం నిర్ణయమయితే ఉపన్యాసకులు నిర్ణయం అవుతారు. సాధారణంగా MTF   సభలు అన్నింటికీ నేను తప్పనిసరిగా హాజరు అవుతాను. ఇక మన కో-కన్వీనర్లలో ఒకరిద్దరు వస్తారు. స్థానిక కో కన్వీనర్ ఎలాగూ వుంటారు. మన సభల్లో పాల్గొనడానికి ఇతర అణగారిన సమూహాల నేతలు కూడా వస్తారు. వీరిలో చీరాల బి. పరంజ్యొతి, ఒంగోలు   నూకతోటి రవికుమార్, విశాఖపట్నం చైతన్య కృష్ణ,   గుంటూరు వైకే ముఖ్యులు. ప్రస్తుతం ఎక్కువ మంది ఆల

General Muslim Voting Trends

General Muslim Voting Trends   31 August 2018 మిత్రులారా ! ముస్లిం ఓటర్లు 2014 ఎన్నికల్లో 60 శాతం YCPకి, 30 శాతం TDP కి 10 శాతం కాంగ్రెస్ కు వేశారని ఒక సర్వే అంచనా. ప్రస్తుతం జగన్ ఓటింగ్ కొంత తగ్గి TDP   ఓటింగ్ కొంత పెరిగినట్టు కనిపిస్తోంది. రాయలసీమ ముస్లింలలో అత్యధికులు జగన్ పక్షాన వున్నారనిపిస్తోంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ముస్లింలు కొంత TDPవైపు మొగ్గు చూపుతున్నారనిపిస్తోంది. తనకు మంత్రి పదవి ఇస్తున్నారన్న ఉత్సాహంతో MLC   MA Sahrief అనేక పట్టణాలు తిరిగి ముస్లింలను TDP   వైపుకు మళ్ళించేందుకు చేసిన ప్రయత్నాలు కొంత వరకు పని చేసినట్టున్నాయి. అయినప్పటికీ టోటల్ సన్నివేశాన్ని గమనిస్తే మెజారిటీ మైనారిటీలు ఇప్పటికీ YCP   పక్షాన్నే వున్నట్టు వాతావరణం సూచిస్తోంది. గుంటూరు నారా హమారా టిడిపి హమారా సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన 30 వరాల్లో ఏ ఒక్కటీ ముస్లింలను ఉత్సాహ పరిచేలా కనిపించడం లేదు.   మిత్రులారా ! మనం ఇప్పటి వరకు జగన్ పక్షమూ కాదు; చంద్రబాబు పక్షమూ కాదు. వాళ్ళిద్దరి మధ్య ఒక పోటీ పెట్టి వచ్చే ఎన్నికల్లో ముస్లిం ఓట్లకు ఒక గుర్తింపును సాధించి, మన సమాజా

ఓటర్ల నమోదులో ముస్లిం వివక్ష

ఓటర్ల నమోదులో ముస్లిం వివక్ష ఓటర్ల నమోదులో ముస్లిం వివక్ష చాలా పెద్ద స్థాయిలో   సాగుతోంది. దీని గురించి సోషల్ మీడియాలో అవగాహన ప్రచారం సాగించాము.   ప్రధాన మీడియాలో పత్రికా విలేఖరుల సమావేశం పెట్టి   సమస్యను ప్రజల దృష్టికి, వివిధ రాజకీయ పార్టీల దృష్టికి, సంబంధిత   ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళే ప్రయత్నం చేశాము.    ఈ వ్యవహారాన్ని పరిశీలించే బాధ్యతను   ఐఐటీ – ఐటి నిపుణులు ష్ర్క్ హుస్సేన్ గారికి అప్పచెప్పాము. వారు వివిధ లాగరిధమ్స్ ద్వార కొన్ని రికార్డులు పరిశీలించి కొన్ని రిపోర్టులు కూడా సమర్పించారు. అయితే, సమస్య పరిష్కారానికి అది సరిపోదు. కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఒక ముస్లీం ఎన్ జివో ఈ సమస్యను టేకప్ చేసింది. ఓటర్ల జాబితా నుండి తొలగింపుకు గురయిన   దాదాపు నాలుగయిదు లక్షల మంది ముస్లిం ఓటర్లను తిరిగి నమోదు చేయించింది. ముస్లిం థింకర్స్ ఫోరం (MTF) కర్ణాటక ముస్లిం సంస్థల తోనూ సంప్రదింపులు జరిపింది. ఇది భారీ ప్రాజెక్టు. 175 నియోజక వర్గాలలో సర్వే దళాలు పనిచేయాలి. కనీసం 40   - 50 లక్షల రూపాయల నిధులు కావాలి, ఓ రెండు వేలమంది కార్యకర్తలు కావాలి.   నియోజకవర్గానికి 200 బూతులుం